
హీరో అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతా పయనం’. ఆయన కూతురు ఐశ్వర్య, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోహీరోయిన్స్గా నటించారు. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. అర్జున్, ధ్రువ సర్జా పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ చిత్రంలోని ‘ఏ ఊరికెళ్తావే పిల్లా’ పాటను గద్దర్ భార్య విమలా గద్దర్ లాంచ్ చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు.
కనకవ్వ, గంగవ్వ, జోగిని శ్యామల, బేబీ లాంటి జానపద కళాకారుల సమక్షంలో ‘సీతా పయనం’ టీం అందరినీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె వెన్నెల కూడా పాల్గొన్నారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ ఫోక్ నెంబర్ను రాహుల్ సిప్లిగంజ్, మధు ప్రియ ఎనర్జిటిక్గా పాడారు. చంద్రబోస్ అందించిన లిరిక్స్, ఈ సాంగ్లో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.