యోగాతో హెల్దీ లైఫ్ :విజయలక్ష్మి

యోగాతో హెల్దీ లైఫ్ :విజయలక్ష్మి
  •     గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
  •     జలగం వెంగళరావు పార్కులో యోగా, మెడిటేషన్ సెంటర్ ఓపెన్

హైదరాబాద్, వెలుగు : యోగాతో హెల్దీగా ఉండొచ్చని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సీఎస్ఆర్​లో భాగంగా బంజారాహిల్స్​లోని జలగం వెంగళరావు పార్కులో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ సంస్థ నిర్మించిన యోగా, మెడిటేషన్ సెంటర్​ను కమిషనర్ రోనాల్డ్ రాస్​తో కలిసి బుధవారం మేయర్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. రోజంతా యాక్టివ్​గా ఉండేందుకు యోగా, మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలన్నారు.  కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, మార్నింగ్ వాకర్స్ పాల్గొన్నారు.