- హైదరాబాద్లో యోగా డే నిర్వహణ
- మే 27 నుంచి 25 రోజులపాటు యోగా కార్యక్రమాలు
హైదరాబాద్: యోగా మన దేశ వారసత్వ సంపద అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించాలని ప్రధాని మోడీ నిర్ణయించారన్నారు. కవాడిగుడాలోని సీజీఓ (CGO) టవర్స్ లో హైదరాబాద్ లోని యోగా సంస్థలతో సమావేశం నిర్వహించారు కిషన్ రెడ్డి. ఆస్ట్రేలియా, అమెరికా సహా 75 ప్రముఖ కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మే 27 నుంచి 25 రోజుల పాటు యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. యోగా మనిషి జీవితంలో ఎంతో మార్పు తెస్తుందన్నారు. యోగా ఏ మతానికి సంబంధించినది కాదని.. యోగా కార్యక్రమంలో అంతా భాగస్వామ్యులు కావాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఇవి కూడా చదవండి
టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి
సినిమాల్లో నారదుడి పాత్రను వక్రీకరించడం బాధాకరం
బోస్టన్లో 'జై భీమ్' కు అవార్డుల పంట