టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి

 టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి (ఈవో)గా ధర్మారెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఈవో జవహర్ రెడ్డిని రిలీవ్ చేసి ధర్మారెడ్డికి  బాధ్యతలు అప్పగించింది  ప్రభుత్వం. సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డిని  సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శిగా  నియమించారు. స్వామివారి  సేవలో  19 నెలలు సేవలందించటం  పూర్వజన్మ  సుకృతమన్నారు  జవహర్ రెడ్డి. ఈ మేరకు  ఆయన శ్రీవారి  ఆలయంలోని రంగనాయకుల  మండపంలో  ధర్మారెడ్డికి  బాధ్యతలను  అప్పగించారు. ఈ సందర్భంగా  జవహర్ రెడ్డిని  శ్రీవారి తీర్థప్రసాదాలు,  చిత్రపటంతో సన్మానించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

TSRTC లాభాల బాట పట్టింది

సినిమాల్లో నారదుడి పాత్రను వక్రీకరించడం బాధాకరం

బోస్టన్లో 'జై భీమ్‌' కు అవార్డుల పంట

కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగినయ్!