యోగిని ఏకాదశి 2025: రేపు ( జూన్ 21) లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి.. ఏమి దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.

యోగిని ఏకాదశి 2025: రేపు ( జూన్ 21)  లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి.. ఏమి దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.

హిందూ మతంలో త్రయోదశి తిథి లయకారుడైన శివునికి అంకితం చేసినట్లే..  ఏకాదశి తిథి ఉపవాసం  సృష్టి పోషకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది.యోగిని  ఏకాదశి రోజున( జూన్​ 21)  ఉపవాసం ఉండి...  శ్రీ మహా విష్ణువును పూజించి... కొన్ని పదార్ధాలు దానం చేయడం వలన శ్రీ హరి విశేష అనుగ్రహం లభిస్తుంది.   ఏ వస్తువు దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. . .

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత

పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి రోజు ( జూన్​ 21)   ఉపవాసం ఉండి.. లక్ష్మీనారాయణులను పూజిస్తే ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామ స్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పొందుతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మ పురాణం చెబుతోంది.

పూజా విధానం

  • యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదాచిత్రపటాన్ని  ఏర్పాటు చేయాలి. గంగాజలంతో అభిషేకించాలి. 
  •  శ్రీ మహా విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం.అందుకే ఈరోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి.
  •  విష్ణుమూర్తికి పసుపు రంగు పూల హారాన్ని సమర్పించాలి.
  •  శ్రీహరి పూజలో పండ్లు, స్వీట్లు, పువ్వులు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.
  •  యోగినీ ఏకాదశి వేళ ఏకాదశి కథను వినాలి. మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి.

యోగిని ఏకాదశి పరిహారాలు

  •  ఏకాదశి ఉపవాసం రోజున మీరు విష్ణువుకు పాయసం సమర్పించాలి. ఇందులో తులసి ఆకులను వేయండి. దీంతో శ్రీ హరివిష్ణువు మీ పట్ల ప్రసన్నుడై మీ కోరికలు తీరుస్తాడు. ఏకాదశి రోజున తులసి ఆకును కోయకూడదు. ఒక రోజు ముందే తులసి ఆకులను కోసి, స్వామివారి కోసం పెట్టుకోవాలి.
  •  పంచామృతం విష్ణువుకు ప్రీతికరమైనది. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేయండి. పంచామృతాన్ని ప్రసాదం రూపంలో తీసుకోండి. దీనితో మీరు విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. ఐశ్వర్యం పెరగడంతో కోరికలు కూడా నెరవేరుతాయి.
  •  ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధన సమయంలో శ్రీమహావిష్ణువుతో పాటు దక్షిణమూర్తి శంఖాన్ని పూజించండి. పూజానంతరం పసుపు బియ్యం, శనగపప్పు, అరటిపండు, బెల్లం, పసుపు బట్టలు మొదలైన వాటిని దానం చేయండి. విష్ణువు అనుగ్రహం వల్ల మీ సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.
  • ఏకాదశి రోజున రావిచెట్టుకు నీరు సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి. శ్రీమహావిష్ణువు ఈ చెట్టులో ఉంటాడు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది.
  • ఏకాదశి రోజు సాయంత్రం తులసిని పూజించండి. తులసిని ఓ పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. మీ సంపద పెరుగుతుంది, జీవితం సంతోషంగా ఉంటుంది

ఇవి దానం చేయండి..

  •  యోగినీ ఏకాదశి వేళ పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
  •  పేదలకు బట్టలు దానం చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి.
  •  యోగినీ ఏకాదశి రోజున నెయ్యిని దానం చేయడం వల్ల తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే నెయ్యిని దేవతల ఆహారంగా పరిగణిస్తారు.
  • బ్రాహ్మణులకు దక్షిణను దానం చేయాలి. ఈ రోజున దక్షిణ దానం చేయడం వల్ల జ్ఞానము.. తెలివి తేటలు లభిస్తాయి
  •  నువ్వులను దానం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయి.
  •  పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి.
  •  గోమాతను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని    వేదపండితులు.. ఆధ్యాత్మికవేత్తల సమాచారంమేరకు .. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.మీకున్న సమస్యలకు వేదపండితులను సంప్రదించడం ఉత్తమం..