బంజారాహిల్స్ పోలీసులపై ఆరోపణలు..దంపతులు తమపై దాడి చేశారంటూ పోలీసుల వివరణ

బంజారాహిల్స్ పోలీసులపై ఆరోపణలు..దంపతులు తమపై దాడి చేశారంటూ పోలీసుల వివరణ

బంజారాహిల్స్ పోలీసులపై దంపతులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కంప్లెయింట్ ఇచ్చేందుకు వచ్చిన తనపై పోలీసులు అత్యాచార చేసేందుకు యత్నించినట్లు బాధితురాలు ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో బాధితురాలి భర్త బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తనపై జరిగిన దారుణం గురించి చెప్పారు.

సీపీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన తమపై బంజారాహిల్స్ పోలీసులు దాడి చేశారని వీడియోలో చెప్పారు. డిసెంబర్ 8న రాత్రి స్టేషన్ లో తనని రబ్బర్ బెల్ట్ తో , లాఠీతో కొట్టారని బాధితుడు చెప్పాడు. ఎస్సై రాంబాబు, ఎస్సై రామిరెడ్డి. ఎస్సై వీడీ నాయుడు సాయంత్రం 6.40కి తమని పైకి తీసుకెళ్లి 4 గంటల పాటు  సీసీ కెమెరాలు లేని రూమ్ లో ఉంచి దాడిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే రోజు క్రికెట్ మ్యాచ్ వస్తోందని, ట్యాబ్ లో మ్యాచ్ చూస్తూ.. బౌండరీ మిస్సయినప్పుడల్లా… వాన్నొకటి పీకు.. దాన్నొకటి తన్ను అంటూ.. ఎస్సై రవికుమార్ హెరాస్ చేసినట్లు చెప్పాడు.  ఎస్సై రామిరెడ్డి రాత్రిపూట వచ్చి.. తన మీదనుంచి.. తన భార్య  మీదనుంచి అటూ ఇటూ జంప్ చేస్తూ…తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు ఆరోపించాడు.  తనకు కోరిక కలగవచ్చంటూ సీఐ ఘోరంగా మాట్లాడి.. రాత్రిపూట తన భార్యను ఉమెన్ పీఎస్ – సీసీఎస్ కు పంపించారని వీడియోలో వివరించాడు. రాత్రి తనని లాకప్ లో పెట్టారని, మర్నాడు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోయి.. డైరెక్ట్ చంచల్ గూడ జైలుకు పంపించారని అన్నాడు.  ఏ కేసు తమపై నమోదు చేశారో తెలియదన్న బాధితుడు.. మర్నాడు కోర్టులో డిఫెండ్ చేయడానికి పోలీసులు, పీపీ రాకపోవడంతో తమకు బెయిల్ వచ్చిందన్నారు.

సీపీకి ఫిర్యాదు చేస్తే ప్రమోషన్లు రావు 

డిసెంబర్ 9వ తేదీన 2009 బ్యాచ్ కు చెందిన సీఐలు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు  ఎస్సై వీడీ నాయుడు తమకు చెప్పినట్టుగా బాధితులు వీడియోలో చెప్పారు . అదేరోజు తమపై  సీపీకి కంప్లయింట్స్ ఇస్తే  తమకు ప్రమోషన్స్ రావని .. అందుకే బంజారాహిల్స్ పోలీసులు అలా చేసినట్లు ఎస్సై తమతో చెప్పాడని బాధితుడు వీడియోలో తెలిపాడు.  పోలీసులు తమపై కఠినంగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియోలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలపై వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ స్పందించారు.

మాపై దాడి చేశారు..అందుకే కేసుపెట్టాం

బాధితుడు అట్లూరి సురేష్ , వాసుదేవ్ శర్మ ఇద్దరికి సివిల్ తగాదాలు ఉన్నాయని తెలిపారు. సురేష్..వాసు దేవ్ శర్మ వద్ద 4 లక్షల 70 వేలు తీసుకున్నడని, డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా బెదరింపులకి దిగాడని చెప్పాడు. ఇది సివిల్ ఇష్యు కాబట్టి కోర్ట్  కి వెళ్లాలని సూచించారు బంజారాహిల్స్ పోలీసులు చెప్పినట్లు డీసీపీ వివరించారు. దీంతో  వాసు దేవ్ శర్మ కోర్ట్ కి వెళ్లి నోటీసు తెచ్చాడని, అదే విషయంపై సురేష్ ను పీఎస్ కు పిలిపించి మాట్లాడినట్లు చెప్పారు.  ఆ సమయంలో ఎసై కాలర్ పట్టుకొని , పోలీసులు పై దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు. దీంతో 8తేదీన ఇద్దరిపై 353, 354, 506 కింద కేసు నమోదు చేసినట్లు ,  పోలీసులు FIR నమోదు చేశారని కక్ష సాధింపు చర్యలుగా ఆరోపణలు చేశారని డీసీపీ వ్యాఖ్యానించారు.

సురేష్ దంపతులు పోలీసులను బ్లాక్ మెయిల్ చేశాడని, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు పేర్లు చెప్పారన్నారు. ఇలాంటివి మరోసారి చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటా డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించు. లీగల్ ఒపీనియన్ తీసుకొని మరోసారి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు పై దురుసుగా ప్రవర్తన చేసే వీడియో లు ఉన్నట్లు ,  తమపై చేస్తున్న ఆరోపణలకి సంబంధించి  ఆధారాల్ని భయటపెట్టాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సూచించారు.