
- యంగ్ ఇండియా క్యాంపులతో స్టూడెంట్లలో జోష్
జనగామ, వెలుగు: సర్కారు బడి స్టూడెంట్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మార్కులు, ర్యాంకులే కాదు ఆటపాటల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తోంది. యంగ్ ఇండియా పేరుతో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తూ నైపుణ్యాలకు పదును పెడుతోంది.
జనగామలో 81 స్కూళ్లలో శిక్షణ
స్టూడెంట్లలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని సర్కారు స్టేట్వైడ్గా సమ్మర్ క్యాంపులు చేపడుతోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 81 స్కూళ్లలో యంగ్ఇండియా క్యాంపులను నిర్వహిస్తున్నారు. 71 ఉన్నత, 9 ప్రైమరీ స్కూళ్లలో ఈనెల 8 నుంచి శిబిరాలు ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు కొనసాగే ఈ శిబిరాల్లో అంతర్గత సామర్థ్యానికి పదును పెడుతున్నారు.
చెస్, క్యారమ్స్వంటి ఇండోర్గేమ్స్, కుట్లు, అల్లికలు, బొమ్మల తయారీ, డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, డ్రమ్స్వాయించడం, సింగింగ్, ఏక పాత్రాభినయం, మిమిక్రీ, యోగా, స్పీడ్ మ్యాథ్స్, పెయింటింగ్, స్పోకెన్ఇంగ్లీష్, కంప్యూటర్ఎడ్యుకేషన్, కథలు చెప్పడం, రాయడం, చేతిరాత మెరుగుపర్చుకోవడం, వ్యక్తిత్వ వికాసం, సైన్స్ఎగ్జిబిట్స్తయారీ, సామాజిక సేవ, తెలంగాణ సంప్రదాయ కళలు వంటి అంశాల పై శిక్షణ ఇస్తున్నారు.
స్టూడెంట్లలో జోష్..
సమ్మర్ క్యాంపుల్లో పాల్గొంటున్న స్టూడెంట్లలో జోష్ నెలకొంది. 6 నుంచి 17 ఏండ్ల లోపు బాల బాలికలకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శిక్షణలు ఇస్తున్నారు. క్యాంపులు నిర్వహిస్తున్న స్కూళ్లలో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు సీనియర్ టీచర్పర్యవేక్షిస్తున్నారు. నిపుణులైన ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇస్తున్నారు. యోగా, స్పీడ్ మ్యాథ్స్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్లకు రూ.2500ల చొప్పున, డాన్స్, మ్యూజిక్, కంప్యూటర్ స్కిల్స్, స్పోర్ట్స్కు క్యాంపు కో ఆర్డినేటర్కు రూ.5 వేలు, అసిస్టెంట్కో ఆర్డినేటర్కు రూ.3500ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఉదయం స్నాక్స్అందిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో క్యాంపులను కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.