
గచ్చిబౌలి, వెలుగు : తండ్రి, సోదరుడు మందలించడంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వెస్ట్ బెంగాల్లోని కాళికాపూర్ప్రాంతానికి చెందిన మిలన్ ఘోష్ కుమారులు సోమంత్ఘోష్(24), సందీప్ఘోష్ సిటీకి వచ్చి డైమండ్హిల్స్ లోనిసాయిబాబా గుడి ఏరియాలో ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. సోమంత్రెండేళ్లుగా మాదాపూర్లోని రైట్ఫుడ్ క్యాంటిన్లో వంట మనిషి, మరో చోట సందీప్ స్వీట్ షాప్లో వంట మనిషిగా పని చేస్తున్నారు. సోమంత్ మద్యానికి అలవాటు పడి రెండు నెలల కిందట మానేసాడు. అతడు రెండు రోజులుగా మళ్లీ మద్యం తాగుతుండడంతో ఫోన్లో తండ్రి, సోదరుడు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన సోమంత్ సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఎవరు లేని సమయంలో గదిలోరూంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు కంప్లయింట్ చేయగా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.