
కూకట్పల్లి, వెలుగు: ఇన్స్టాగ్రామ్లో ఓ సాఫ్ట్వేర్ యువతికి పరిచయమైన యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలానగర్పోలీసుల కథనం ప్రకారం.. ఖాజాగూడలో ఉండే యువతి(25)కి నెల రోజుల క్రితం బాలానగర్లో నివసించే జక్కా సిద్ధారెడ్డితో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లో చాటింగ్ చేస్తుండేవారు. గత నెల 29న ఆ యువతి బర్త్డే కావడంతో సిద్ధారెడ్డి తన రూమ్లో పార్టీ చేసుకుందామని కోరాడు. అంగీకరించిన ఆమె అదేరోజు సాయంత్రం బాలానగర్పరిధి మాధవినగర్లోని అతని గదికి వెళ్లింది. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.
అందులో మత్తు మందు కలిపిన సిద్ధారెడ్డి ఆ యువతి నిద్రలోకి జారుకున్నాక అత్యాచారం చేసి, పరారయ్యాడు. తెల్లవారుజామున మెలకువ వచ్చాక జరిగింది గ్రహించిన బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.