టమాటాలు దొంగిలించాడని కొట్టిన్రు

టమాటాలు దొంగిలించాడని కొట్టిన్రు

మంచిర్యాల, వెలుగు :  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో టమాటాలు దొంగిలించాడని ఓ వ్యక్తిని వ్యాపారి కొట్టాడు. దండేపల్లి మండలం రెబ్బనకు చెందిన గంగులు మంచిర్యాలలో వెహికల్స్ కు క్లీనర్ గా పనిచేస్తున్నాడు. గతంలో కూరగాయల వ్యాపారి కృష్ణ దగ్గర పనిచేశాడు.

శనివారం మార్కెట్ కు వచ్చిన గంగులును పట్టుకొని టమాటాలు దొంగిలించావని కృష్ణ, అతని కొడుకులు కొయ్యకు కట్టేసి చితకబాదారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని గంగులును విడిపించారు. బాధితుడి ఫిర్యాదుతో కృష్ణ, అతడి కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.