- టీఆర్ఎస్ దీక్ష ఉన్నందున పర్మిషన్ ఇవ్వని పోలీసులు
హైదరాబాద్, వెలుగు: వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల చేపట్టనున్న 72 గంటల దీక్ష వాయిదా పడింది. అదే రోజు అదే ప్లేస్లో టీఆర్ఎస్ దీక్ష ఉన్నందున షర్మిల దీక్షకు సెంట్రల్ జోన్ పోలీసులు పర్మిషన్ నిరాకరించి నట్లు పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. హైదరాబాద్ మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇతర ప్రాంతాల్లో దీక్ష చేయలేక పోతున్నట్లు తెలిపాయి. అయితే, శనివారం నుంచి ధర్నా చౌక్లో దీక్ష చేసేందుకు పోలీసుల పర్మిషన్ అడిగినట్లు, శుక్రవారం దీనిపై నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పినట్లు పార్టీ నేత పిట్టా రాంరెడ్డి తెలిపారు.