సీఎం జగన్ను కలిసిన షర్మిల

సీఎం జగన్ను కలిసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను ఆయన సోదరి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. తన తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియతో కలిసి ఆమె జగన్ నివాసానికి వెళ్లారు. తన కుమారుడి నిశ్చితార్థం, పెళ్లి వేడుకలకు రావాలని.. జగన్ తో పాటు వదిన భారతికి షర్మిల ఆహ్వాన పత్రిక అందజేశారు.

రేపు(జనవరి 04) షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ను కలవడం రాజకీయంగా హాట్ టాఫిక్ గా మారింది.