భారత మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్..కరోనా పేషెంట్లను ఆదుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కొవిడ్ బారిన పడి..ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో వారి కోసం ప్రత్యేకంగా.. 100 బెడ్లతో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఈ ఆస్పత్రిని యువరాజ్సింగ్ ఫౌండేషన్ నిర్మించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ సంజరు దీక్షిత్ తెలిపారు.
యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నుంచి తమకు ఓ లేఖ అందిందని, మూడున్న కోట్లతో..100 బెడ్లతో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు యువీ ఫౌండేషన్ ఆ లేఖలో తెలిపినట్లు సంజరు దీక్షిత్ తెలిపారు. అయితే ఆ హాస్పిటల్ నిర్మాణం కోసం వారు 30 రోజుల టైం కోరినట్లు చెప్పారు. యువీ ఫౌండేషన్ పంపిన లేఖను ఆమోదించినట్లు ఎంజీఎం మెడికల్ కాలేజీ డీన్ సంజరు దీక్షిత్ తెలిపారు.