న్యూఢిల్లీ: ఆన్లైన్ పుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. ‘ఆన్టైం లేదా ఫ్రీ’ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ప్రకారం ఆర్డర్ ఆన్ టైంలో రాకపోతే, కస్టమర్లు మనీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఆఫర్ను డోమినోస్ ఎప్పటి నుంచో ఇస్తోంది. డోమినోస్ ‘30 నిమిషాలు లేదా ఫ్రీ’ అనే ఆఫర్ను కస్టమర్లకు అందిస్తోంది. కానీ జొమాటో స్పష్టమైన టైం ను ప్రకటించలేదు. కంపెనీ మొదట “ ఫ్రీ పుడ్ పొందడానికి మీరు చేసిన క్రేజియస్ట్ పనేంటి?” అని ట్విట్టర్లో ట్వీట్చేసి, ఆ తర్వాత ఈ ఆఫర్ను రివీల్ చేసింది. ఈ ఫీచర్ ప్రకారం పుడ్డెలివరీ ఆన్టైంలో ఉంటుందని లేకపోతే మనీ ఇవ్వాల్సిన పనిలేదని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్ఇండియాలోని 100కు పైగా సిటీలలోని వేల రెస్టారెంట్ల జొమాటో మెనూకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫీచర్ను వాడాలనుకుంటే, ఆర్డర్ పెట్టేటప్పుడు ‘ఆన్ టైం లేదా ఫ్రీ’ పై క్లిక్చేయాలి. జొమాటో ఆన్టైంలో డెలివరీ చేయలేకపోతే, మనీ తిరిగి వాపసు ఉంటుందని తెలిపింది. ఆర్డర్ ఆన్టైం లేక ఫ్రీ ఆర్డరా అనే విషయం డెలివరీ పార్టనర్లకు, రెస్టారెంట్లకు తెలియదని కంపెనీ పేర్కొంది. అందువలన డెలివరీ పార్టనర్లు టైం బ్రేక్ చేసే అవకాశం లేదని అభిప్రాయపడింది. కంపెనీ ఈ ఫీచర్ను ప్రకటించక ముందే “కభీతో లేట్హో జాతే’ అంటు టీవీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ యాడ్ బ్యాక్గ్రౌండ్లో ‘తోడా సా లేట్ హోజాతా’ అంటు సాంగ్ వినిపిస్తుంది. కానీ డెలివరీ బాయ్ప్రతి సారి పుడ్ను ఆన్టైంలోనే డెలివరి చేస్తారు. సౌత్ ఇండియాకు సంబంధించి ఈ యాడ్లో విజయ్దేవరకొండ జొమాటో యూజర్గా నటించారు. ఇండియా పుడ్ డెలివరీ మార్కెట్లో మేజర్ వాటా పొందేందుకు జొమాటో, స్విగ్గీ పోటీపడుతున్నాయి. తాజాగా ఉబర్కు చెందిన ఉబర్ ఈట్స్ను జొమాటో కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ విలువ 400 మిలియన్ డాలర్లని, డీల్ప్రకారం ఉబర్ఈట్స్, జొమాటోలో 150–200 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుందని కూడా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.