ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల నిధుల మంజూరుకు నిజామాబాద్జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావును వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు వేర్వేరుగా కలిశారు.
నియోజకవర్గ సమస్యలను వివరించి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. నిధుల మంజూరుకు వారు హామీ ఇచ్చారని వినయ్రెడ్డి తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో డీసీసీ వైస్ప్రెసిడెంట్వెల్మల్గోపి, సొసైటీ చైర్మన్ ముల్లంగి అశోక్, కాంగ్రెస్ నేత దయాకర్ రావు తదితరులున్నారు.
