సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వ్ చేయడంపై లొల్లి

సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వ్ చేయడంపై లొల్లి
  •     నిర్మల్​ జిల్లాలో దస్తురాబాద్​ మండలం పెరికపల్లిలో గ్రామస్తుల ఆందోళన

కడెం, వెలుగు: నిర్మల్  జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్  లొల్లి పెట్టింది. సర్పంచ్  స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్​ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆదివారం ధర్నా, రాస్తారోకో చేశారు. నిర్మల్  జిల్లా దస్తురాబాద్  మండల కేంద్రంలోని పెరికపల్లి సర్పంచ్  స్థానాన్ని రిజర్వేషన్​లో భాగంగా ఎస్సీలకు కేటాయించగా, గ్రామానికి చెందిన బీసీలు దీనిని వ్యతిరేకించారు. 

గ్రామంలో 99 శాతం మంది బీసీలు ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎస్సీలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. గతంలోనూ సర్పంచ్ తో పాటు 2 వార్డులను ఎస్సీలకు కేటాయించారని వాపోయారు. అధికారులు వెంటనే రిజర్వేషన్​ను సవరించాలని డిమాండ్  చేశారు.