ఓ రోడ్డు ప్రమాద ఘటనలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల క్రితం నాసిక్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.1.49 కోట్ల పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ మేరకు సంబంధిత వ్యక్తులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బోరివలిలో నివాసం ఉంటున్న నీలేశ్ జోషి(39) 2018 నవంబర్ 10వ తేదీన తన కారులో వెళ్తుండగా నాసిక్ సమీపంలోని సిన్నార్-షిర్డీ రోడ్డులోని పెట్రోల్ బంక్ దగ్గర ఓ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నీలేశ్తో పాటు కారులో ప్రయాణిస్తోన్న అయిదుగురు మృతి చెందారు. నీలేశ్ చనిపోయే నాటికి ఓ ప్రైవేటు ఇన్ఫ్రాస్ట్రక్టర్ సంస్థలో పనిచేస్తున్నాడు. అప్పుడు అతను నెలకు రూ.లక్ష వేతనంగా పొందుతున్నాడు. మరో కన్సల్టెన్సీ సంస్థలో పార్ట్ టైం జాబ్ తో రూ.75వేలు అదనంగా సంపాదిస్తున్నాడు. ఈ ప్రమాదంలో నీలేశ్ మృతి చెందడంతో అతనిపైనే అధారపడిన అతని కుటుంబం కేసు నమోదు చేశారు. ఇటీవల మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ముందుకు ఈ కేసు విచారణకు జరిగింది.
ALSO READ : మైతీలను ఎస్టీల్లో చేర్చడంపై.. కోర్టు ఉత్తర్వులు మార్పు
దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నీలేశ్ బంధువులకు రూ.1.49 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని గురువారం ఆదేశించింది. పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి దానికి 7.5 శాతం వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని తీర్పు వెలువరించింది. బస్సు యజమాని చంద్రకాంత్ లక్ష్మీనారాయణ ఇందాని నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణం అయినందుకుంకు గానూ అతను, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు రూ.1.49 కోట్లు చెల్లించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.