యువత జాబ్ మేళాలు వినియోగించుకోవాలి : కలెక్టర్ రాజర్షిషా

యువత జాబ్ మేళాలు వినియోగించుకోవాలి :  కలెక్టర్ రాజర్షిషా
  •  కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత కోసం ప్రభుత్వం ఎంప్లాయిమెంట్​శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్​ మేళాలను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాజర్షి షా అన్నారు.  మంగళవారం స్థానిక ఎస్టీయూ భవన్​లో తెలంగాణ ప్రభుత్వ టాస్క్ స్టేట్ఆర్గనైజేషన్,​ జిల్లా ఎంప్లాయిమెంట్​శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్​ మేళాను ఆయన ప్రారంభించారు.  కలెక్టర్​మాట్లాడుతూ..   ప్రైవేటు రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. 

యువత నైపుణ్యం పెంపొందించుకొని అత్యున్నత వేతనాలు పొందే ఉద్యోగాలను దక్కించుకోవచ్చన్నారు. మెగా జాబ్​ మేళాలో 34 ఎమ్​ఎన్​సీ కంపెనీలు హాజరవగా దీనికి 3,580 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో 296 యువతీ, యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ శ్యామలాదేవి,  జిల్లా ఉపాధికల్పనాధికారి మిల్కా, మున్సిపల్​ కమీషనర్​ సీవీఎన్​.రాజు, డీవైఎస్​ఓ జక్కుల శ్రీనివాస్​, డీఐఈఓ గణేశ్​ జాదవ్​, ఇండస్ట్రియల్​ అధికారి నాగభూషనమ్​, తదితరులు పాల్గొన్నారు.