- ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం టీయూఎఫ్ ఐడీసీ ద్వారా ఆర్మూర్ మున్సిపల్కు మంజూరైన రూ.27 కోట్ల 20 లక్షల నిధులతో 36 వార్డుల్లో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మలివిడత టీయూఎఫ్ ఐడీసీ ద్వారా రూ.19 కోట్ల 62 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసుకుందామన్నారు. ప్రత్యేక నిధులు రూ.18 కోట్ల 70 లక్షలు ఆర్మూర్కు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.
శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకం ద్వారా రూ.43 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపల్గా అప్గ్రేడ్ అయిన ఆర్మూర్ లో అభివృద్ధి పనులు జరగలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
బోధన్ తో సమానంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి బోధన్ ఎమ్మెల్యే మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మోత్కూరి లింగాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు, పోల్కం వేణు, కలిగోట్ గంగాధర్, సుంకరి రంగన్న తదితరులు పాల్గొన్నారు.
