- రసూల్పురా ఘటన పై డీజీపీ, సీపీ స్పందించాలి
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో అసలు లా అండ్ ఆర్డర్ అమలు అవుతుందా అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. రసూల్ పురాలో ప్రదీప్ అనే వ్యక్తిపై కొందరు కత్తులతో దాడి చేసిన ఘటనపై సీపీ సీవీ ఆనంద్, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన.. దాడి చేసిన వాళ్లకే బేగంపేట సీఐ సపోర్ట్ చేస్తున్నారని.. కార్డన్ సెర్చ్లు హైదరాబాద్లో ఎందుకు చేస్తలేరని ఆయన ప్రశ్నించారు.