మద్య నిషేధానికి గ్రామస్తుల తీర్మానం

 మద్య నిషేధానికి గ్రామస్తుల తీర్మానం

పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఆదివారం గ్రామంలో మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం విక్రయాలు చేయకూడదని ‌ బెల్ట్ షాప్ నిర్వాహకులకు వినతి పత్రాలు ఇచ్చారు. 

ఇక నుంచి ఎవరైనా మద్యం తాగినా, అమ్మినా రూ. 50 వేలు జరిమానా విధిస్తామని తీర్మానించారు. యువకులు మద్యానికి బానిసవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు.