ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్రెడ్డి చిరస్మరణీయుడని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు.
కష్టకాలంలో జశ్వంత్రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. జశ్వంత్రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ కు సమాచారం తెలియగానే.. వెంటనే స్పందించారు.