సింగరేణి పెన్షన్దారులకు మెరుగైన సేవలు

సింగరేణి పెన్షన్దారులకు మెరుగైన సేవలు
  • సీఎంపీఎఫ్ కమిషనర్​ హరి పచౌరి
  • పెన్షన్​ పేమెంట్​ ఆర్డర్స్​ అందజేత

కోల్​బెల్ట్, వెలుగు: పెన్షన్ ​పొందుతున్న సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్​కు మెరుగైన సేవలు అందిస్తున్నామని సీఎంపీఎఫ్​కమిషనర్​(రీజియన్) హరిపచౌరి అన్నారు. సోమవారం మందమర్రి సింగరేణి జీఎం ఆఫీస్​లో ఏరియా ఏస్వోటుజీఎం విజయప్రసాద్​అధ్యక్షతన నిర్వహించిన కోఆర్డినేటర్స్ కమిటీ మీటింగ్​కు ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. కొత్త పెన్షన్ స్కీం, ప్రావిడెంట్ ఫండ్, సీఎంపీఎఫ్ (భవిష్యనిధి) తదితర అంశాలపై ఏరియా ఆఫీసర్లతో చర్చించారు. 

అనంతరం 583 రివైజ్డ్ పీపీవో పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిపచౌరీని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మందమర్రి, రామకృష్ణాపూర్​బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్​అలీ, వైస్​ ప్రెసిడెంట్​ఇప్పకాయల లింగయ్య, జీఎం స్ట్రక్చర్ కమిటీ మెంబెర్ సీవీ రమణ సన్మానించారు. కార్యక్రమంలో ఇన్​చార్జ్ పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, సీఎంపీఎఫ్​కమిషనర్​-కె.గోవర్ధన్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బి.శంకర్​గౌడ్ ​తదితరులు పాల్గొన్నారు.