నెక్కొండ డీటీపై కలెక్టర్ ఆగ్రహం

నెక్కొండ డీటీపై కలెక్టర్ ఆగ్రహం

నెక్కొండ/ పర్వతగిరి, వెలుగు: వరంగల్​ జిల్లా నెక్కొండ, పర్వతగిరి తహసీల్దార్​ ఆఫీసులను కలెక్టర్​ సత్యశారద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో నెక్కొండ డీటీ రవి డ్యూటీలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి మెమో జారీ చేయాలని తహసీల్దార్​ రాజ్​కుమార్​ను ఆదేశించారు. ఈనెల15లోపు భూభారతి అప్లికేషన్లు పూర్తిచేయాలని, పెండింగ్​లేకుండా డిస్పోజ్​చేయాలన్నారు. ఆమెవెంట ఆర్డీవోలు ఉమారాణి, సత్యపాల్​రెడ్డి, డీఏవో పణికుమార్, డీటీటీవో సౌజన్య. తహసీల్దార్లు రాజ్​కుమార్​, వెంకటస్వామి తదితరులున్నారు.