
- హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి
శాయంపేట(దామెర), వెలుగు: గవర్నమెంట్ హాస్టల్స్, స్కూళ్లలో చదివే స్టూడెంట్స్కు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్వెంకట్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్లోని ఎంజేపీ, మైనారిటీ, సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్, కాలేజీలను అడిషనల్ కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో స్టోర్ చేసిన కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను, స్టోర్రూంను పరిశీలించారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్ భోజనం అందిస్తున్నారా అని స్టూడెంట్స్ను అడిగి తెలుసుకున్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలన, వాటి నియంత్రణ చర్యలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆయా స్కూల్, కాలేజ్ ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.