ఇండోర్ లో ఇండియా ఓటమి

ఇండోర్ లో ఇండియా ఓటమి

ఇండోర్ లో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి సిరీస్ ను టీమిండియాకు అప్పగించిన దక్షిణాఫ్రికా చివరి మ్యాచ్ లో ఊరట పొందింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా 227 పరుగులు చేసింది. 18.3 ఓవర్లలో భారత్ క్రికెట్ జట్టు 178  పరుగులు చేసి ఆలౌట్ అయింది.

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్స్ విజయాన్ని అందుకోలేకపోయారు. టీమిండియా ఇన్నింగ్స్ లో దినేశ్ కార్తీక్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. దినేశ్ కార్తీక్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులుతో రాణించాడు. కాగా, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు