హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా కవిత

 హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా కవిత
  • 31న ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న సంఘం నేతలు

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మిక సంఘాల విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇటీవల టీబీజీకేఎస్​ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గౌరవాధ్యక్షురాలిగా కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్​ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా కవితను హిందూస్తాన్​ మజ్దూర్ ​సభ (హెచ్ఎంఎస్​) గౌరవాధ్యక్షురాలిగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 31న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో జనరల్​ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కవితను గౌరవాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు హెచ్ఎంఎస్​జనరల్ ​సెక్రటరీ రియాజ్​అహ్మద్ ​ప్రకటించారు. 

టీబీజీకేఎస్​ గౌరవాధ్యక్షురాలిగా సింగరేణి కార్మికుల కోసం ఆమె అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్​లోని కవిత నివాసంలో సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్​ నాయకులు భేటీ అయ్యారు.