ఒడిశా టు ఖమ్మం.. బస్సులో అక్రమంగా గంజాయి రవాణా.. నలుగురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

ఒడిశా టు ఖమ్మం.. బస్సులో అక్రమంగా గంజాయి రవాణా.. నలుగురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

ఖమ్మంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్కోటిక్స్​ సెల్​అధికారులు. ఒడిశానుంచి హైదరాబాద్​ కు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు డ్రగ్​ పెడ్లర్లను అరెస్ట్​ చేశారు. గోదావరి ఖని, ఖమ్మం  బస్టాండులలో తనిఖీలు చేపట్టగా గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు అయింది. ఒడిశా నుంచి బస్సుల్లో గంజాయి తరలిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. వివరాల్లోకి వెళితే.. 

ఖమ్మం జిల్లాలో శనివారం (జనరి 31) నార్కోటిక్స్​ సెల్​ అధికారులు ముమ్మరంగా తనీఖీలు చేపట్టారు.  ఖమ్మం, గోదావరి ఖనీ బస్టాండులలో విస్తృతంగా జరిపిన తనిఖీలో  పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. ఒడిశానుంచి ఖమ్మం జిల్లాకు బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్​ చేశారు.  ఖమ్మంలో ఇద్దరు, గోదావరిఖనిలో మరో ఇద్దరిని  అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాంగి రఘుపతి, పాంగి సాబి లు ఒడిశాలోని కొరాపూట్ నుంచి హైదరాబాద్​ కు గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  మరో డ్రగ్​ పెడ్లర్​ మహేష్​ వామన్​ రావు పరారీలో ఉన్నాడు. నిందితులను ఖమ్మం రూరల్​ పోలీసులకు అప్పగించారు.

►ALSO READ | ఫైర్ సేఫ్టీపై హైడ్రా స్పెషల్ ఫోకస్.. షాపుల యజమానులకు కీలక ఆదేశాలు..