2028 నాటికి ఎస్ఎల్‌‌‌‌బీసీ పూర్తవ్వాలి

2028 నాటికి ఎస్ఎల్‌‌‌‌బీసీ పూర్తవ్వాలి
  • అధికారులకు మంత్రి ఉత్తమ్​కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశం
  • ప్రతి నెలా 175 మీటర్ల తవ్వకం చేపట్టాలి
  • అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్​ పనులను పున:ప్రారంభించాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. 2028 జనవరి నాటికి  పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌లో ఎస్ఎల్​బీసీ పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్​ శాఖ గౌరవ సలహాదారుగా లెఫ్టినెంట్​ జనరల్​ హర్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌సింగ్​ బాధ్యతలు చేపట్టారు. ఈ సమీక్షలో ఆయన కూడా పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా జియోలాజికల్​ సర్వేలు, పనుల పునరుద్ధరణ వ్యూహాలు, భద్రతా చర్యలపై చర్చించారు. రివైజ్డ్​ ప్లాన్​, ఆర్థిక అంచనాల ప్రకారం పనులు చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్​ సూచించారు. ప్రతినెలా 175 మీటర్ల మేర టన్నెల్​ తవ్వకం చేపట్టాలన్నారు.  గురువారం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రివ్యూ చేస్తారని తెలిపారు. 

ప్రపంచంలోనే లేటెస్ట్​ టెక్నాలజీ అయిన హెలిబార్న్​ సర్వే చేయిస్తున్నామని పేర్కొన్నారు. నేషనల్​ జియోఫిజికల్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ (ఎన్‌‌‌‌జీఆర్‌‌‌‌‌‌‌‌ఐ) హెలికాప్టర్​తో సర్వే చేసి.. టన్నెల్​ ప్రాంతంలో షియర్​ జోన్లు, బలహీనమైన రాతి ప్రాంతాలు, ఫాల్ట్​ లైన్స్‌‌‌‌ను గుర్తిస్తుందని చెప్పారు. తద్వారా టన్నెల్​లో ఎక్కడెక్కడ రిస్క్​ ఉందో తెలుసుకోవడం అధికారులు సులభమవుతుందని తెలిపారు. సర్వేను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టాలని, టైమ్‌‌‌‌ ఫిక్స్​చేయాలని అధికారులను ఆదేశించారు. 

సవరించిన బడ్జెట్‌‌‌‌లోనే పూర్తవ్వాలి

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ ప్రాజెక్టును ప్రస్తుతం సవరించిన అంచనాల బడ్జెట్‌‌‌‌లోనే పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. ఆ విధివిధానాలను స్ట్రిక్ట్‌‌‌‌గా ఫాలో అవ్వాలన్నారు. మరో ప్రమాదం రాకుండా చూడాలని, ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టును టైమ్‌‌‌‌లోపు పూర్తి చేస్తేనే లక్షలాది మంది రైతులకు నీళ్లు అందుతాయన్నారు. 

వెంటిలేషన్​ మెథడాలజీ కీలకం: హర్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌సింగ్​

టన్నెల్‌‌‌‌లో వెంటిలేషన్​, డాక్యుమెంటేషన్​ మెథడాలజీ చాలా కీలకమని లెఫ్టినెంట్​ జనరల్​ హర్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌సింగ్​పేర్కొన్నారు. రాష్ట్రంలో యువ ఇంజినీర్లకు ఇలాంటి వ్యవస్థలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. టన్నెల్‌‌‌‌లో ఒక చివరి నుంచి 21 కిలోమీటర్లు, మరో చివరి నుంచి 14 కిలోమీటర్ల మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు వివరించారు.