డ్రీమ్ హౌజ్లో డ్రీమ్ ప్లేయర్తో... ఆతిథ్యం నచ్చుతుందో లేదో అని భయపడ్డా..కానీ

 డ్రీమ్ హౌజ్లో డ్రీమ్ ప్లేయర్తో... ఆతిథ్యం నచ్చుతుందో లేదో అని భయపడ్డా..కానీ

డ్రీమ్ హోమ్ లో..డ్రీమ్ ప్లేయర్తో...డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరు. హైదరాబాద్ పేసర్...రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ఆ కిక్కును తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ కు సిరాజ్ తన డ్రీమ్ హౌజ్లో పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి తన అభిమాన..ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ ముఖ్యఅతిథిగా హాజరవడంతో ..సిరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 

ఆర్సీబీ వచ్చేలోపే కంప్లీట్ చేయాలని..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహ్మద్ సిరాజ్ తన డ్రీమ్ హోమ్ ను  నిర్మించుకున్నాడు. ఇందులో తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు..ఆర్సీబీ టీమ్ కు విందు ఇవ్వాలని ప్లాన్ చేశాడు. మే 18న మ్యాచ్ ఆడేందుకు ఆర్సీబీ టీమ్ హైదరాబాద్ వస్తుందని..ఆ లోపే డ్రీమ్ హోమ్ ను పూర్తి చేయాలని అనుకున్నాడట. ఎట్టకేలకు హైదరాబాద్ లో ఆర్సీబీ టీమ్ అడుగుపెట్టకముందే తన డ్రీమ్ హోమ్ ను పూర్తి చేయించుకున్నాడు. అనంతరం ఆర్సీబీ టీమ్ ను తన ఇంటికి ఆహ్వానించి హైదరాబాద్ రుచులను అందించాడు. 

నచ్చుతుందో లేదో అని..

ఆర్సీబీ టీమ్కు తన  ఆతిథ్యం నచ్చుతుందో  లేదోనని కంగారుపడ్డానని  సిరాజ్ వెల్లడించాడు. హోస్ట్‌గా కాస్త ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీ టీమ్ తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ముఖ్యంగా కోహ్లీ రావడం గర్వంగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌తో పాటు తన ఇంటికి వచ్చిన ప్లేయర్లకు సిరాజ్ ధన్యవాదాలు తెలిపాడు.