కొమురంభీం జిల్లాలో విషాదం..నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి

కొమురంభీం జిల్లాలో విషాదం..నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి

కొమురంభీం జిల్లా  వాంకిడి మండలం దాబా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కాపాడటానికి వెల్లి ముగ్గురు పిల్లలతో పాటు నీటి మడుగులో పడిపోయింది తల్లి. ఈ ఘటనలో  తల్లితో పాటు  ముగ్గురు  చిన్నారు మృతి చెందారు. 

 సెప్టెంబర్ 13న వాగులో మందు బస్తాలు శుబ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ముడుగులో మునిగిన  పిల్లలను కాపాడటానికి  తీవ్రంగా ప్రయత్నించిన తల్లి నీలబాయి  ఆ మడుగులోనే మునిగి  ప్రాణాలు విడిచింది.

ఈ ఘటనతో  దాబా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ముడుగులో మునిగి చనిపోయిన  నలుగురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.