సీఎం సభకు మున్సిపల్ ​ట్యాంకర్లు.. వాటర్​ సప్లై లేక జనాలకు తిప్పలు 

సీఎం సభకు మున్సిపల్ ​ట్యాంకర్లు.. వాటర్​ సప్లై లేక జనాలకు తిప్పలు 

మంచిర్యాల, వెలుగు:  సీఎం సభ ఏర్పాట్ల కోసం మున్సిపల్ వాటర్​ ట్యాంకర్లను వినియోగిస్తుండడంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు నీళ్లు లేక గోస పడుతున్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్​ కొత్త కలెక్టరేట్ ను ఓపెన్​చేయనుండడంతో కలెక్టరేట్​ఆవరణలో రోడ్లు, గ్రీనరీ ఏర్పాటు, మొక్కలు నాటే పనులు చేపడుతున్నారు. ఈ పనులకు మున్సిపల్​ వాటర్​ట్యాంకర్ల ద్వారా వాటర్​ సప్లై చేస్తున్నారు. ఓవైపు జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీ, హమాలివాడ,  దొరగారిపల్లె, గొల్లవాడ, సుందరయ్య కాలనీతో పాటు శివారు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు.

Also read:డ్రంకెన్ ​డ్రైవ్ టెస్ట్​ తప్పించుకోబోయి.. బస్సు కింద పడి యువకుడు మృతి

మరోవైపు అధికారులు ఆయా కాలనీలకు వాటర్​ సప్లై బంద్​చేసి మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా తాగునీటితో కలెక్టరేట్​ఆవరణలోని మొక్కలను తడుపుతున్నారు. రెండు రోజులుగా ట్యాంకర్లు రాకపోవడంతో ప్రజలు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం కొంతమంది ఫారెస్ట్​ ఆఫీస్​ దగ్గరలోని వాటర్​ ట్యాంక్​ దగ్గరకు వెళ్లి ట్యాంకర్ల గురించి ఆరా తీశారు. తాము తాగునీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం సీఎం సభ ఏర్పాట్ల కోసం మున్సిపల్ ట్యాంకర్లు వాడుతున్నారని మండిపడ్డారు. దీంతో మున్సిపల్​ అధికారులు ఆయా కాలనీలకు ఒకట్రెండు ట్యాంకర్లు పంపించారు.