కేంద్రం, ట్విట్టర్ మధ్య ముదురుతోన్న వివాదం

కేంద్రం, ట్విట్టర్ మధ్య ముదురుతోన్న వివాదం


కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. శుక్రవారం పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించకపోవడంపై ట్విట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్రం. కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్ కు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన కేంద్రం... నిబంధనలు అమలు చేయకపోవడంపై సీరియస్ గా ఉంది.