
- అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపిన పోలీసులు
దుండిగల్, వెలుగు: మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్పై బయటకు వచ్చి దొంగతనాలు చేస్తున్న ఖైదీని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలం మక్తలక్ష్మాపూర్కు చెందిన గొండ్ల రాములు తండ్రిని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. గత నెల 25న నెల రోజుల పెరోల్ పై బయటకు వచ్చాడు. వచ్చిన కొన్ని రోజులకే దుండిగల్ మున్సిపల్ పరిధిలోని ఒక ట్రాక్టర్, కారు, గండిమైసమ్మ దగ్గర ఓ వైన్స్ ముందు స్కూటీ చోరీ చేశారు.
ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేయడంతో దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చోరీ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.