ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ స్వాగతం పలికారు. అండ్రూస్ జాయింట్ బేస్ ఎయిర్ పోర్టులో దిగిన మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి వైట్ హౌస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానించారు.
బహుమతులు..
జిల్లి బైడెన్...జో బైడెన్ తో ప్రధాని మోదీ చర్చలు చేసారు. ఈ సందర్భంగా జిల్లీ బైడెన్ ప్రధాని మోదీకి 20వ శతాబ్దానికి సంబంధించి అమెరికన్ బెక్ గ్యాలరీని బహుమతిగా అందించారు. అధ్యక్షుడు జో బైడెన్ వింటేజ్ అమెరికా కెమేరాను ప్రధాని మోదీకి గిఫ్ట్ గా అందచేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
అంతకుముందు వాషింగ్టన్ లో ప్రధాని మోదీ నేషనల్ సైన్స్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్తో కలిసి వేదికను పంచుకున్నారు. భారత్ -అమెరికా విద్యార్థులను కలుసుకున్నారు. వారితో ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు.
శ్వేతసౌధంలో ప్రధాని మోదీకి గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు తన అధికారిక నివాసం వైట్ హౌస్లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. డిషెస్ లో ప్రధాని మోదీ నిరంతరం ప్రమోట్ చేసే మిల్లెట్స్ను ఉంచారు. ఈ రోజు ప్రధాని మోదీ అమెరికన్ జాయింట్ కాంగ్రెస్ను సైతం ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.