
కొవిడ్కి సరైన మెడిసిన్ లేక కిందటేడాది ఎంత బాధపడ్డామో అందరికీ తెలిసిందే. అందుకే వ్యాక్సినేషన్ని గవర్నమెంట్ ఒక మిషన్లా చేపట్టి, ప్రతి ఒక్కరికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తున్నారు. అయినా కూడా కొంతమంది అపోహలతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. అయితే ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు గతంలో కొన్ని రంగాల్లో రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా పవన్ అనే వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. వచ్చే ఆదివారం అందరూ ఎంతో సంబురంగా రాఖీ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రాఖీ కొనే వాళ్లకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ చూపిస్తే 50% డిస్కౌంట్ ఇస్తానని అనౌన్స్ చేశాడు. ఇలాగే ఇంకొంతమంది వ్యాపారులు కూడా రాఖీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నారు.