- రిటైర్డ్ అయిన ఐదుగురు ఐఏఎస్ లకు రెండేండ్ల పాటు సేమ్ పోస్టు
- 12 మందికి ముఖ్య సలహాదారులు,
- సలహాదారుల పోస్టులు సర్కారు సొమ్ముతో
- అన్ని సౌలతులు అసంతృప్తిలో ఇతర ఐఏఎస్లు
- స్పెషల్ సీఎస్లుగా రీఅపాయింట్మెంట్
రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడంతా రీఅపాయింట్మెంట్ల హవా నడుస్తున్నది. నిరుడు స్పెషల్ సీఎస్ హోదాలో రిటైరయిన అధర్ సిన్హాకు ప్రభుత్వం రెండేళ్ల పాటు పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్గా ఆయననే కొనసాగిస్తూ రీఅపాయింట్ చేసింది. ఆ తరువాత జీఏడీలో ప్రొటోకాల్ సెక్రటరీగా ఉన్న అర్విందర్ సింగ్ను కూడా మళ్లీ అదే పోస్టులో రెండే ళ్ల పాటు నియమించింది. ఇక దేవాదాయ, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ కూడా రిటైర్ అయ్యాక.. తిరిగి ఆ శాఖలోనే అదే పోస్టులో పున ర్నియమించింది. కార్మిక శాఖ స్పెషల్ సీఎస్గా రిటైర్ అయిన రాణి కుముదినిని మళ్లీ అదే పోస్టు లో నియమించింది. 10 నెలల కింద రిటైర్ అయిన ఒమర్ జలీల్ను కూడా ప్రభుత్వ కార్యదర్శి, మైనారిటీ వెల్ఫే ర్ కమిషనర్గా రీఅపాయింట్ చేసింది. ఏడా దిన్నరలో ఐదుగురిని రీ అపాయింట్మెంట్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సలహాదారులుగా ఇట్లా
వివిధ పోస్టుల్లో రిటైర్ అయినవాళ్లు ప్రస్తుతం 12 మంది ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన రాజీవ్ శర్మ ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సీఎం చీఫ్ అడ్వయిజర్గా ఉన్నారు. సీఎస్ హోదాలో పదవీ విరమణ పొందిన ఎస్.కె. జోషి ఇరిగేషన్ అడ్వయిజర్గా ఉన్నారు. 2012లో రిటైర్ అయిన కె.వి.రమణాచారి ప్రభుత్వ అడ్వయిర్ గా కొనసాగుతున్నారు. పీసీసీఎఫ్ హోదాలో పదవీ విరమణ చేసిన శోభకు అదే రోజున అడ్వయిజర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ కూడా సలహాదారులుగా కొనసాగుతున్నారు. సుధాకర్ తేజ ఆర్ అండ్ బీకి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్ ఎనర్జీ సెక్టార్కు, శ్రీనివాస్రావు హార్టికల్చర్కు సలహాదారులుగా ఉన్నారు.
కొందరికి అట్లా.. ఇంకొందరికి ఇట్లా
ఆఫీసర్ల విషయంలో రాష్ట్ర సర్కారు ఒక్కోలా నిర్ణయం తీసుకుంటున్నది. అనుకూలంగా అనిపించ కపోయినా.. ఆ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ మధ్యలోనే రాజీనామా చేసి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో గతంలో కనిపించాయి. ఇందులో ఆకునూరి మురళి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీకే సింగ్లాంటి వాళ్లున్నారు. గతంలో సీఎస్గా నియమితులైన రెండు నెలలకే ప్రదీప్ చంద్ర రిటైర్ అయ్యారు. సీఎస్ హోదాలో ఉన్న ఐఏఎస్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చిన సర్కారు.. ప్రదీప్ చంద్ర అనుకూలంగా లేకపోవడంతోనే అలా చేసిందని పెద్ద చర్చ జరిగింది. కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు లూప్ పోస్టులు ఇచ్చి, అనుకూలంగా ఉన్నోళ్లకు మంచి డిపార్ట్మెంట్లను కేటాయిస్తున్నది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఏల్ఎ, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఒకే అధికారి,హెచ్ఎండీఏ, ఎమ్ఏయూడీ స్పెషల్ సీఎస్, సీడిఎంఏ కమిషనర్ పోస్టులు ఒక అధికారి దగ్గరే ఉన్నాయి. ఇదిలా ఉంటే దాదాపు 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పోస్టింగ్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. వారిలో హరిచందన, శైలజా రామయ్యర్, హైమవతి, సత్యశారద, నిఖిల, నవీన్ నికోలస్, అరుణ శ్రీ వంటి వాళ్లు ఉన్నారు.
ఏడాదికి 20 కోట్లపైనే ఖర్చు
ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారికి స్పెషల్గా ఆఫీస్ సౌకర్యం కల్పించడంతో పాటు వెహికల్, ముగ్గురు స్టాఫ్, ఇతర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం
భరిస్తున్నది. ఒక్కొక్కరికి జీతాలు రూ. 2 లక్షలపైనే ఉన్నట్లు తెలిసింది. ఇలా జీతాలు, ఇతర అవసరాలకు కలిపి నెలకు రూ. కోటిన్న రపైనే ఖర్చు అవుతుండగా.. ఏడాదికి దాదాపు రూ.20 కోట్లు దాటుతున్నది.