
- జూబ్లీహిల్స్ నియోజకర్గంలో పర్యటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: రెహ్మత్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. జూబ్లీహిల్స్ రెహ్మత్నగర్ డివిజన్లో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమర భేరీ కార్యక్రమానికి జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా రహ్మత్ నగర్కు వచ్చిన మంత్రి వివేక్కు స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కార్యకర్తలతో కలిసిపోయారు. వారితో మాట్లాడుతూ.. బైక్పై పర్యటిస్తూ జన సమీకరణ చేశారు. కార్యకర్తలతో చాయ్ తాగి.. ఎల్బీ స్టేడియానికి వెళ్తున్న బస్సుకు పచ్చ జెండా ఊపారు. అంతకు ముందు ఆయన స్థానికులతో మాట్లాడారు.
రహ్మత్ నగర్ అభివృద్ధి తన బాధ్యత అని.. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను గాడిలో పెడతానన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకొచ్చి డివిజన్ను డెవలప్చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెరవేరుస్తున్నామన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పారు.