అలంపూర్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలకు రూ.45 కోట్లు

అలంపూర్  నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలకు రూ.45 కోట్లు

అలంపూర్, వెలుగు: అలంపూర్  నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.45 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్  మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున మంజూరు చేస్తూ మంగళవారం హైదరాబాద్​లోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రోసిడింగ్  పత్రాలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు అందజేశారు. రాష్ట్ర టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్  ఇస్మాయిల్, మహేశ్ గౌడ్  ఉన్నారు.