సిక్కిరెడ్డి, సుమీత్‌కు టైటిల్స్‌

సిక్కిరెడ్డి, సుమీత్‌కు టైటిల్స్‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇండియా సీనియర్‌‌‌‌ షట్లర్లు సిక్కిరెడ్డి, సుమీత్‌‌‌‌ రెడ్డి మాల్దీవ్స్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌ లో విజేతలుగా నిలిచారు. రోహన్‌‌‌‌ కపూర్‌‌‌‌తో సిక్కి మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గగా, అతనితోనే సుమీత్‌‌‌‌ మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో చాంపియన్‌‌‌‌ అయ్యాడు.

ఆదివారం జరిగిన మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఫైనల్లో నాలుగో సీడ్‌‌‌‌ సిక్కి–రోహన్‌‌‌‌ జంట 21–16, 21–18తో టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ తనినా వయొలెట్‌‌‌‌–కొసెలియ మమ్మెరి (అల్గేరియా) జంటను వరుస గేమ్స్‌‌‌‌లో ఓడించింది. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ తుదిపోరులో సుమీత్‌‌‌‌–రోహన్‌‌‌‌ ద్వయం 21–-23, 21–-19, 21–-17తో చలెంపన్‌‌‌‌–నంతకరన్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌)పై నెగ్గింది. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో ఇండియా ప్లేయర్‌‌‌‌, టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ ఆకర్షి కశ్యప్‌‌‌‌ 24–22, 21–21తో తోటి షట్లర్‌‌‌‌ ఐరా శర్మను ఓడించి చాంపియన్‌‌‌‌గా నిలిచింది.