
హైదరాబాద్: హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ, ఎస్ ఫిడేల్ ఆర్ స్నేహిత్.. యూటీటీ నేషనల్ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో సిల్వర్, బ్రాంజ్తో మెరిశారు. తిరువనంతపురంలో మంగళవారం జరిగిన విమెన్స్ ఫైనల్లో టాప్సీడ్ శ్రీజ (ఆర్బీఐ) 1–4 (8–11, 11–5, 5–11, 9–11, 10–12)తో దియా చిటాలే పరాగ్ చేతిలో ఓడింది. సెమీస్లో శ్రీజ 4–1తో సుతీర్థ ముఖర్జీ (ఆర్ఎస్పీబీ)పై, క్వార్టర్స్లో 3–0తో వర్గీస్ జెన్నిఫర్ (మహారాష్ట్ర)పై, ప్రిక్వార్టర్స్లో 3–0తో కౌశాని నాథ్ (బెంగళూరు), తొలి రౌండ్లో 3–1తో రాధాప్రియ గోయల్ (ఏఏఐ)పై నెగ్గింది.
ఇక మెన్స్ సెమీస్లో స్నేహిత్ 3–4 (7–11, 11–3, 15–13, 4–11, 10–12, 13–11, 7–11)తో మానవ్ థక్కర్ (పీఎస్పీబీ) చేతిలో ఓడి బ్రాంజ్తో సరిపెట్టుకున్నాడు. క్వార్టర్స్లో స్నేహిత్ 3–0తో యషాన్ష్ మాలిక్ (ఢిల్లీ)పై, ప్రిక్వార్టర్స్లో 3–0తో ముతు రాజశేఖర్ (తమిళనాడు)పై, తొలి రౌండ్లో 3–2తో రాజ్ మోండల్ (ఆర్బీఐ)పై గెలిచాడు.