స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన టెన్త్ బ్యాచ్‌‌ స్టూడెంట్స్

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన టెన్త్ బ్యాచ్‌‌  స్టూడెంట్స్

మిడ్జిల్, వెలుగు: మండలంలోని వేముల గ్రామానికి చెందిన ఆవుల మల్లేశ్​ అనారోగ్యంతో ఇటీవల చనిపోగా, విషయం తెలుసుకున్న టెన్త్​‌‌(2003–04) బ్యాచ్‌‌  స్టూడెంట్స్​ ఆదివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.30వేల ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి భార్య, పిల్లలకు ఆర్థికసాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్నేహితుడు మల్లేశ్​కు చికిత్స కోసం రూ. 54 వేలు అందించామని తెలిపారు. చిన్న వయసులో మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఎండీ మాసుం బాబా, రాజేశ్, పాండు, ప్రకాశ్ గౌడ్, రామాంజనేయులు గౌడ్, బాలా గౌడ్  పాల్గొన్నారు.