కరోనాతో సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు మృతి

కరోనాతో సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు మృతి

బతుకు తెరువు కోసం ఎడారి దేశం సౌదీ అరేబియాకు వెళ్లిన 11 మంది భారతీయులను కరోనా బలితీసుకుంది. కరోనా వైరస్ బారిన పడి 11 మంది భారతీయులు చనిపోయారని సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. మదీనాలో నలుగురు, జెడ్డాలో ఇద్దరు, మక్కాలో ముగ్గురు, రియాద్, దమ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని ప్రకటించారు. సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులంతా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. సౌదీలో ఇప్పటి వరకు 13,930 మంది కరోనా బారినపడగా… వీరిలో 121 మంది మృతి చెందారు.