ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 137 పోలింగ్​ బూత్​లు

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 137 పోలింగ్​ బూత్​లు

హైదరాబాద్ : హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ టీచర్స్​ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు 137 పోలింగ్​ కేంద్రాలను సిద్ధం  చేశారని హైదరాబాద్​ జిల్లా ఎలక్షన్​ అథారిటీ అధికారి తెలిపారు. ఈనెల 13న పోలింగ్​, 16న ఓట్ల లెక్కింపు జరగనుందని పేర్కొన్నారు. 12 ఫ్లయింగ్​ స్క్వాడ్​లను నియమించినట్లు తెలిపారు. జిల్లాల్లో మొత్తంగా 27,720 మంది ఎమ్మెల్సీ టీచర్స్​ నియోజకవర్గ ఎన్నికలకు ఓటర్లుగా నమోదయ్యారని వివరించారు.