2024 సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 96 కోట్ల 28 లక్షల మంది ఓటర్లున్నారని ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు కానుంది. జూన్ 16 తో పార్లమెంట్ 18 వ లోక్ సభ గడువు ముగియనుంది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల్లో 1.50 కోట్ల మంది విధులు నిర్వహించనున్నారు. జూన్ 16 లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఈసీ ప్రకటించింది. కశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఈసీ తెలిపింది. 55 లక్షల ఈవీఎంలను సిద్దం చేసినట్లు ఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.