- నిజామాబాద్ జిల్లాలో 1,077 దాఖలు
- కామారెడ్డి జిల్లాలో 1,066
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నిమాజాబాద్లో 2,143 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ఆశావహులు క్యూకట్టి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
శనివారం స్ర్కూటినీ నిర్వహించి అర్హత గల నామినేషన్ల సంఖ్యను అధికారులు తేల్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని 165 సర్పంచ్ స్థానాలకు 1,077 నామినేషన్లు పడ్డాయి. 1,620 వార్డులుండగా 4,021 నామినేషన్లు ఆర్వోలు స్వీకరించారు.
కామారెడ్డి జిల్లాలో 168 పంచాయతీలకు 1,066 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలు 1,482 ఉండగా 3,060 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీంగల్, డింకేశ్వర్, కమ్మర్పల్లి, మెండారో, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఎర్గెట్ల మండలాలు, కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, డొంగ్లి, పెద్దకొడప్గల్ మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నెల 9 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలు, గుర్తులుప్రకటించనున్నారు.
