ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్వర్టర్ ఫ్యాక్టర్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.