
మెక్సికో ద్వారా చొరబడేందుకు యత్నం
వెనక్కి తిప్పి పంపిన ఇమిగ్రేషన్ అధికారులు
మెక్సికో సిటీ: అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు వచ్చిన 311 మంది ఇండియన్స్ను మెక్సికో తిరిగి వాళ్ల సొంత దేశానికి పంపింది. వారంతా మెక్సికో ద్వారా అక్రమంగా అమెరికాలోకి వెళ్లాలనుకున్నారని అధికారులు చెప్పారు. ఇంటర్నేషనల్ ఏజెంట్ల ద్వారా.. రెండు ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లలో మెక్సికోకు వచ్చారని ఇమిగ్రేషన్ అధికారి చెప్పారు. ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గర 20 నుంచి 30 లక్షలు వసూలు చేశారన్నారు. ఆ 311 మందిని స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పంపారు. నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్లో , 60 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్తో శుక్రవారానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు.