40 ఏండ్ల చెట్లు.. నేలకొరుగుతున్నయ్​

40 ఏండ్ల చెట్లు..  నేలకొరుగుతున్నయ్​
  • వెలవెలబోతున్న ఖమ్మం - కురవి రోడ్డు

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం నుంచి కురవి వెళ్లే రోడ్డులో 1984లో నాటి ఎన్టీఆర్​ ప్రభుత్వం హయాంలో నాటిన చెట్లు 40 ఏళ్లుగా ప్రజలకు నీడనిస్తున్నాయి. ఇప్పుడు నేలకొరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డును విస్తరించాలనే డిమాండ్​తో ప్రభుత్వం నాలుగు లేన్ల రోడ్డుతో పాటు డివైడర్​ మంజూరు చేసింది. రోడ్డు​ విస్తరణకు అడ్డువస్తున్న చెట్లను కాంట్రాక్టర్​ పది రోజులుగా నరికి వేస్తున్నారు.

40 ఏళ్లుగా నీడనిస్తున్న చెట్లు ఒక్కసారిగా కుప్పకూలుతుండడంతో ఖమ్మం–కురివి రోడ్డు వెలవెలబోతోంది. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న పద్మశ్రీ వనజీవి రామయ్య ఈ వృక్షాలకు వేసవికాలంలో నీళ్లుపోసి పెంచారు. ఇప్పుడు ఆ చెట్లను నరుకుతుండడంతో ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి భాగంగా చెట్లను నరుకుతున్నందున ఒక్క చెట్టు స్థానంలో రెండు మొక్కలు నాటాలని, రహదారి పూర్తయిన వెంటనే ఇరువైపులా విస్తారంగా మొక్కలతో కళకళలాడేలా చూడాలని పలువురు కోరుతున్నారు.