
ట్రిపుల్తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని ఆ ఐదుగురు మహిళలు స్వాగతించారు. ఏళ్ల తరబడి సాగిన పోరాటం తర్వాత విజయం వరించిందని ఆనందిస్తున్నారు. తమలాంటి బాధితులకు అండగా నిలవడంతో పాటు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ధైర్యమిచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్దాఖలుతో మొదలెట్టిన తమ పోరాట ఫలితం మొదట అత్యున్నత న్యాయస్థానంలో తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో కనిపిస్తోందని చెప్పారు. ఆ ఐదుగురు.. ఉత్తరాఖండ్కు చెందిన షయరా బానో, యూపీకి చెందిన గుల్షన్పర్వీన్, అతియా సాబి, రాజస్థాన్కు చెందిన అఫ్రీన్రెహ్మాన్, పశ్చిమ బెంగాల్కు చెందిన ఇష్రత్జహాన్.
షయరా బానో
ఉత్తరాఖండ్లోని కాశీపూర్కు చెందిన షయరా బానో ట్రిపుల్తలాక్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి మహిళ.. ఎమ్మె సోషియాలజీ చదివిన బానోకు ఆమె భర్త రిజ్వాన్అహ్మద్2015లో డైవోర్స్ఇచ్చాడు. షయరా పుట్టింటికి వెళ్లిన సమయంలో లెటర్ద్వారా రిజ్వాన్ ట్రిపుల్తలాక్చెప్పాడు. తర్వాత ఇద్దరు పిల్లలను తీసుకుని సొంతూరు అహ్మదాబాద్కు వెళ్లాడు. భర్త రాసిన లెటర్ను మతపెద్దలకు చూపించగా.. అది చెల్లుబాటవుతుందని వారు చెప్పారు. దీంతో మానసికంగా కుంగిపోయిన షయరా కోలుకోవడానికి నెలలు పట్టింది. ఆపై ఆమె ట్రిపుల్తలాక్, హలాలా అంశాలను సవాల్చేస్తూ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 లో కోర్టు ట్రిపుల్తలాక్చెల్లదంటూ కోర్టు తీర్పివ్వడంతో ముస్లిం మహిళలకు అదో చరిత్రాత్మక రోజని షయరా సంతోషం వ్యక్తం చేశారు.
అఫ్రీన్రెమ్మాన్
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన అఫ్రీన్రెహ్మాన్ గృహహింస, కట్నం వేధింపుల బాధితురాలు.. మాట్రిమోనియల్పోర్టల్ద్వారా ఇండోర్కు చెందిన సయ్యద్అషర్అలి వర్సిని ఆమె 2014లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని నెలలకే అత్తింటి వారు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసలకు గురిచేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు 2015లో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని అఫ్రీన్చెప్పారు. ప్రాణభయంతో పుట్టింటికి చేరిన అఫ్రీన్కు 2016 జనవరిలో భర్త నుంచి తలాక్ లెటర్అందింది. అంతకుముందు బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకుంది, కాళ్లు విరిగాయి. సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో డిప్రెషన్కు లోనైన అఫ్రీన్.. తర్వాత కోలుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గుల్షన్ పర్వీన్
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన గుల్షన్పర్వీన్ డౌరీ బాధితురాలు.. రెండేళ్ల పాటు అదనపు కట్నం కోసం భర్త హింసించాడు. 2015లో ఆమెను పుట్టింటికి పంపించి, స్టాంప్పేపర్పై తలాక్ నామా రాసి పోస్టులో పంపించాడు. ఆ లెటర్తో తను, తన కొడుకు నిరాశ్రయులమైపోయామని పర్వీన్ చెప్పారు. ఆ విడాకులను అంగీకరించేది లేదని, పర్వీన్న్యాయపోరాటం ప్రారంభించారు. వరకట్న వేధింపుల చట్టం కింద భర్తను జైలుకు పంపించి, ట్రిపుల్తలాక్ను రద్దు చేయాలంటూ గుల్షన్పర్వీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అతియా సాబ్రి
ఉత్తరప్రదేశ్లోని షహరన్పూర్కు చెందిన అతియా సాబ్రికి 2012లో పెళ్లయింది. భర్త వాజిద్అలి. పదమూడేళ్ల కాపురం తర్వాత వాజిద్అలి ఓ చిన్న కాగితంపై ట్రిపుల్తలాక్రాసి అతియా సోదరుడి ఆఫీస్కు పోస్ట్లో పంపించాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో అత్తింటి వాళ్లు మాటలతో వేధించారని, ఒకరోజు ఆహారంలో విషం కలపడంతో తాను ఆస్పత్రి పాలయ్యానని అతియా వివరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాజిద్ను అరెస్టు చేశారని అన్నారు. లెటర్ద్వారా డైవోర్స్ఇవ్వడాన్ని అతియా తప్పుబట్టారు. ట్రిపుల్తలాక్మహిళల ప్రాథమిక హక్కులను అణిచివేస్తోందని ఆరోపిస్తూ అతియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు
ఇష్రత్జహాన్
పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన ఇష్రత్జహాన్కు ఆమె భర్త ముర్తజా ఫోన్లో విడాకులిచ్చాడు. పదిహేను సంవత్సరాల కాపురం తర్వాత దుబాయ్నుంచి ఫోన్చేసిన ముర్తజా.. మూడుసార్లు తలాక్చెప్పి, ఫోన్పెట్టేశాడు. తర్వాత ఇండియాకు వచ్చి మరో పెళ్లి చేసుకోవడంతో పాటు నలుగురు పిల్లలను తీసుకొని పోయాడని ఇష్రత్చెప్పారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక తన కాపురంలో కలతలు స్టార్టయ్యాయని అన్నారు. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో తనకు మగపిల్లాడు కావాలని, దానికోసం మరో పెళ్లి చేసుకుంటానని ముర్తజా తరచుగా అంటుండడం గొడవలకు దారితీసిందన్నారు. 2010లో ఇష్రత్మగపిల్లాడికి జన్మనిచ్చినా వారి బంధం కొనసాగలేదు. దీంతో కోర్టుకెక్కిన ఇష్రత్.. విడాకులకు తాను వ్యతిరేకం కాదని, విడాకుల ప్రాసెస్న్యాయబద్ధంగా ఉండాలన్నదే తన డిమాండ్అని చెప్పారు.